telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీకి గవర్నర్‌ రావడం శుభపరిణామం: పవన్ కల్యాణ్

Janasena pawan comments Jagan

నవ్యాంధ్ర నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన శ్రేణుల తరపున బిశ్వభూషణ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. అపార రాజకీయ అనుభవం ఉన్న హరిచందన్‌ ఏపీకి గవర్నర్‌గా రావడం శుభపరిణామం అని అన్నారు.

నిధుల కొరత, విభజన హామీలు అమలు కాక సతమతమవుతున్న ఏపీకి హరిచందన్ అండగా ఉంటారని ప్రజలు ఆశతో ఉన్నారని అన్నారు. జ్ఞానసంపన్నుడు,రాజకీయ యోధుడైన హరిచందన్ గవర్నర్ పదవికి మరింత వన్నె తీసుకువస్తారని ఆశిస్తున్నానని ఓ ప్రకటనలో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Related posts