telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ తీర్థం పుచ్చుకున్న సినీ నటి ప్రియారామన్

ప్రముఖ సినీ నటి ప్రియారామన్ బీజేపీ తీర్థం పుచ్చుకుంది. ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమక్షంలో ఆమె కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రియారామన్ మాట్లాడుతూ సమాజసేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. పదవులు తనకు ముఖ్యం కాదని పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని తెలిపారు.

రాజకీయాలలో ప్రధాని మోదీ తన రోల్ మోడల్ అని చెప్పారు. దక్షిణాది భాషల్లోని పలు చిత్రాల్లో ప్రియారామన్ నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 50కి పైగా చిత్రాల్లో నటించారు. దీంతో ప్రియారామన్ సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. నగరిలో రెండో దపా ఎమ్మెల్యేగా ఉన్న రోజా కూడ సినీ రంగం నుండి వచ్చారు. దీంతో నగరిలో ఆమెను బరిలోకి దింపొచ్చనే ప్రచారం కూడ సాగుతోంది.

Related posts