సినీ నటుడు పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై కులపరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. తమ ఎదుట హాజరుకావాలని ఈసీ పోసాని ని ఆదేశించింది. చంద్రబాబుకు కులాన్ని ఆపాదిస్తూ పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు.దీంతో ఆయనకు ఈసీ నోటీసు జారీ చేసింది. నోటీసులపై పోసాని కృష్ణమురళి స్పందించారు. ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని లేఖలో స్పష్టం చేశారు.