టీవీ9 రవిప్రకాశ్కు బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీవీ9 లోగో విక్రయం కేసులో 41 సీఆర్పీసీ కింద నోటీసులు పంపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. రేపు బంజారాహిల్స్ పీఎస్లో విచారణకు హాజరుకావాలని రవిప్రకాశ్కు పంపిన నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు.
తొలి రోజు నుండి విచారణలో పోర్జరీ ఆరోపణలపై టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ పొంతనలేని సమాధానాలే చెప్పినట్టు అధికారులు తెలిపారు. దీనితో విచారణ ఇంకా కొనసాగించాలని అధికారులు నోటీసులు జారీచేశారు. విచారణకు సహకరించకుంటే త్వరలోనే తమ అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రవిప్రకాష్ మాత్రం తనను కావాలనే ఇరికించారంటూ పడినపాటే పడుతూ ఉన్నాడట!