telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా భూషణ్‌ శ్రీధర్‌, మునిరెడ్డి

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను కేంద్రం బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తంగా 44 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కాగా.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. విశాఖ లింగరాజుపాలెం హైస్కూల్‌ ఉపాధ్యాయుడు భూషణ్‌ శ్రీధర్‌, చిత్తూరు జిల్లా ఎం.పైపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మునిరెడ్డికి అవార్డులు లభించాయి. ఇక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. కే. రంగయ్య, పయ్యావుల రామస్వామి బెస్ట్‌ టీచర్స్‌గా ఎంపికయ్యారు.

Related posts