తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. స్వామివారి సర్వదర్శనానికి ఈ ఉదయం 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
మరికొంత మంది భక్తులు దర్శనానికి వస్తున్నారు. టైమ్ స్లాట్, దివ్య, రూ. 300 ప్రత్యేక దర్శనం భక్తులకు దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 67,103 మంది భక్తులు దర్శించుకున్నారు.