ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… వరద బాధితులు ఇంటి దగ్గరే ఉండండని.. మీ ఇంటి దగ్గరకే వచ్చి డబ్బులు ఇస్తామని కేటీఆర్ చెప్పారని…ఇప్పటి వరకు చాలా మంది వరద బాధితులకు డబ్బులు రాలేదని ఫైర్ అయ్యారు. మీ సేవ దగ్గర వందల సంఖ్యలో క్యూ లైన్ లు కడుతున్నారని..ఉదయం నుండి రాత్రి వరకు లైన్లో నిలబడ్డ చాలా మంది అప్లికేషన్స్ ను స్వీకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూ లైన్ లో వృద్ధులు, వికలాంగులు,చిన్న పిల్లల తల్లులు ఉంటున్నారని..చాలా మంది లైన్ లో నిలబడి సొమ్ము జిల్లిపోయి కింద పడుతున్నారని పేర్కొన్నారు. లైన్ లో నిలబెట్టి ప్రజలను టి ఆర్ ఎస్ ప్రభుత్వం అవమానపరుస్తుందని..ప్రజలను అవమానపర్చే హక్కు టిఆర్ఎస్ కు ఎవరు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని..తక్షణమే ప్రజలకు కేసీఆర్, కేటీఆర్ క్షేమపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టిఆర్ ఎస్ ఇచ్చే డబ్బులు ఏ ములకు సరిపోవని..Mim ను అడ్డుపెట్టుకొని టి ఆర్ ఎస్ గెలవాలని చూస్తుందని తెలిపారు. టిఆర్ఎస్ కు ghmc ప్రజలు బుద్ది చెప్పుతారని పేర్కొన్నారు.
previous post
మీడియాలో ఓ వర్గం చంద్రబాబుకు పల్లకీ సేవ: విజయసాయిరెడ్డి