ఈ నెల 1 నుండి మన దేశంలో 18 ఏళ్లు పైబడినవారికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్కు అనుమతి ఇచ్చినా.. వ్యాక్సిన్ల కొరత కారణంగా అది సాధ్యం కాలేదు. అయితే, త్వరలోనే 18 ఏళ్లు పైబడినవారికి కూడా రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుంది.. 10 రోజులు దాటిన తర్వాత ఇవాళ్టి నుంచి రెండో డోసును ప్రారంభించింది ప్రభుత్వం.. ఇక, 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కొవిడ్ టీకాలు వేసేందుకు అన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. రాష్ట్రంలో ప్రైవేటు కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలుగా గుర్తింపు పొందిన అన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఇకపై అర్హత ఉన్నవారికి వ్యాక్సిన్ ఇచ్చే వెసులుబాటు కల్పించింది. మరోవైపు.. వ్యాక్సినేషన్కు ప్రైవేట్ ఆస్పత్రులతో అనుసంధానం కావాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.. 18 ఏళ్లు పైబడినవారు వ్యాక్సిన్ కోసం కొవిన్ పోర్టల్లో తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. అయితే చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.
previous post