రానున్న లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీచేస్తానని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్ల అభినందన సభలో కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత మీదేనని సూచించారు.
సర్పంచ్గా ఓడిపోయిన వారు మనోధైర్యం కోల్పోవద్దన్నారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం గ్రామజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టి నిధులు మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు. అంతేకాకుండా కేంద్రం నుంచి గ్రామాలకు వచ్చే నిధులను కూడా పక్కదోవ పట్టించారని విమర్శించారు. ఈసారైనా ప్రభుత్వం నిధులు కేటాయించి గ్రామాలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.
టీడీపీ నుంచి వచ్చిన వాళ్లు బీజేపీ భావజాలంతోనే పనిచేయాలి: జీవీఎల్