ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల తేదీ ఖరారైంది. ఏపీలో మూడు…తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఆగస్టు 7న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 14 వరకు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా ఈసీ ప్రకటించింది. 16న నామినేషన్ల పరిశీలన, 19వతేదీ వరకు ఉపసంహరణ గడువుగా ఈసీ పేర్కొంది. ఈ నెల 26న ఎన్నికలు నిర్వహిస్తామని, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుందని ఈసీ ప్రకటించింది. ఏపీలో కరణం బలరామకృష్ణమూర్తి, కృష్ణ శ్రీనివాస్, వీరభద్రస్వామి రాజీనామా చేశారు. తెలంగాణలో యాదవరెడ్డిపై అనర్హత వేటుతో ఉప ఎన్నికలు జరగనున్నాయి.
next post