telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

ఉరేసుకొని ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య

Crime

ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తున్న మిస్తు సర్కార్ అనే యువతి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గుర్ గావ్ లోని డీఎల్ఎఫ్ ఫేజ్-3లో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్న ఆమె… గదిలోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని, విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. తన కూతురు ఉంటున్న పేయింగ్ గెస్ట్ అకామడేషన్ యజమానే తమ కుమార్తె ఆత్మహత్యకు కారణమని ఆమె తండ్రి ఆరోపించారు.

పేయింగ్ గెస్ట్ అకామడేషన్ ఓనర్ తనను హింసిస్తున్నాడని ఆ సందర్భంగా తన కూతురు చెప్పిందని ఆయన తెలిపారు. తాను రూముకు తిరిగి వచ్చిన సమయంలో తనను కించపరుస్తూ మాట్లాడాడని ఆవేదన వ్యక్తం చేసిందని చెప్పారు. తన ఫోన్ ను అతను హ్యాక్ చేశాడని, ఎక్కడికీ వెళ్లకుండా అడ్డుకుంటున్నాడని ఏడుస్తూ చెప్పిందని తెలిపారు. ఓనర్ హింసను భరించలేకపోతున్నానని తనకు చెప్పిందని, ఇదే విషయాన్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కూడా పేర్కొన్నానని మృతురాలి తండ్రి చెప్పారు.

ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ, తమకు ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలిని పరిశీలించారని, అవసరమైన ఆధారాలను సేకరించారని తెలిపారు. ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశామని చెప్పారు.

Related posts