ఢిల్లీ..ఇరు తెలుగు రాష్ట్రాల జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటులో జాప్యానికి తెలంగాణ సీఎం కేసీఆరే కారణమని, జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. ఆలస్యానికి తాము కారణం కాదన్నారు.
గత ఏడేళ్లుగా వివాదంలో కొనసాగుతున్న జల వివాదానికి కేంద్రం ఎలా కారణమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాల పరిధిలోని జల వివాదాల పరిష్కారానికి కేంద్రం సుముఖంగా ఉందన్నారు. ప్రజలకు, దేశానికి వాస్తవ విషయాలు చెప్పాల్సిన ఆవశ్యకత కేంద్రంపై ఉందన్నారు. కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.