బీజేపీ, వైసీపీ కలిసి కాపురం చేస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విశాఖపట్టణం జిల్లా నర్సీపట్టణంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు కేంద్రంలో ఒక నాటకం, రాష్ట్రంలో మరో నాటకాన్ని రక్తికట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలకు తెలియకుండా రాష్ట్రంలో ఏమీ జరగడం లేదన్నారు.
ముఖ్యమంత్రి జగన్కు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆయన ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతి విషయంలో జీవీఎల్ చేస్తున్న ప్రకటనలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులపై ప్రస్తావిస్తూ.. హైకోర్టు ఎక్కడ పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని, కానీ సచివాలయం, అసెంబ్లీ మాత్రం ఒక్క చోటే ఉండాలని నారాయణ స్పష్టం చేశారు.
ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ యూటర్న్: షబ్బీర్ అలీ