telugu navyamedia
సినిమా వార్తలు

రామ్ తో పూరీ, ఛార్మి “ఇస్మార్ట్” పార్టీ

Ismart-Shankar

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్ “ఇస్మార్ట్ శంకర్” అద్భుతమైన కలెక్షన్లు సాధించి దూసుకుపోతుంది. ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌ హీరోయిన్లుగా నటించారు. పునీత్ ఇస్సార్‌, స‌త్య‌దేవ్‌, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుధాంశు పాండే త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. జూలై 18న విడుద‌ల అయిన ఈ చిత్రం అదే క్రేజ్‌తో ముందుకు సాగింది. “ఇస్మార్ట్ శంకర్” విడుదలకు వారం రోజుల ముందే అమెరికా వెళ్లిపోయాడు రామ్. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఈయన ఎక్కడా ప్రమోషన్స్‌లో కూడా కనిపించలేదు. మరోవైపు పూరీతో రామ్‌కు గొడవ జరిగిందని.. ఆయన పారితోషికం విషయంలో రచ్చ అవుతుందని వార్తలు వినిపించాయి. అయితే అన్నీ పుకార్లే అని తేలిపోయింది. రామ్ అమెరికా నుంచి రావడం.. వచ్చిన వెంటనే పార్టీ చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. మామూలుగా కాదు.. ఛార్మి, పూరీ కలిసి రామ్‌ను తడిసి ముద్దయ్యేలా చేసారు. మందు పార్టీతోనే చిందేసారు.. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రామ్ కొత్త లుక్‌లో కనిపించి రప్ఫాడించాడు. చాలా రోజులుగా గడ్డంతో కనిపించిన రామ్.. ఇప్పుడు క్లీన్ షేవ్‌లోకి వచ్చేసాడు. ఈయన లుక్ చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. మరోవైపు పూరీ జగన్నాథ్ కూడా రామ్‌తో ఉన్న ర్యాపోను కొనసాగిస్తున్నాడు. “ఇస్మార్ట్ శంకర్” విజయం చూసిన తర్వాత స్టార్ హీరోలు డేట్స్ ఇస్తారేమో అనుకుంటే ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఇప్పుడు పూరీ మరోసారి రామ్ హీరోగా ఇంకో సినిమా చేయాలని చూస్తున్నాడు. అందుకే ఇస్మార్ట్ శంకర్ లాభాల్లో ఆయనకు కూడా వాటా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

Related posts