తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి తొమ్మిదో ఏడాదిలోకి అడుగుపెట్టిన వేళ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను అదే స్పూర్తితో అభివృద్ధి చేసుకున్నామని కేసీఆర్ అన్నారు.
దేశానికే దిక్సూచిగా తెలంగాణ తన ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని అన్నారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం అన్ని రంగాల్లో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధి నమోదు చేస్తుందన్నారు. దీనికి జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలే సాక్ష్యమన్నారు కేసీఆర్. ఎనిమిదేళ్లలో తెలంగాణాకి జరిగిన సంక్షేమం, అభివృద్ధి ఊహించలేనంతగా సాధించామన్నారు.
పరిశ్రమలు మౌలిక వసతుల కల్పన, వ్యాపార, వాణిజ్యంలో దేశానికే నేడు తెలంగాణ పాఠాలు నేర్పే స్థాయికి వచ్చిందని వివరించారు. ఆర్థిక క్రమశిక్షణ, ప్రజా సంక్షేమ పాలనను అందించటంలో ప్రభుత్వం విజయవంతం అయ్యిందన్నారు. రాష్ట్రానికి సహకరించాల్సిన కేంద్రం.. వివక్ష చూపిస్తున్నా… వెనకడుగు వేయకుండా బంగారు తెంగాణ దిశగా సాగుతున్నామన్నామని చెప్పారు సీఎం కేసీఆర్.
మత విద్వేశాలు రెచ్చ గొట్టి చలికాచుకోవాలనేదే బీజేపీ ప్రయత్నం..