telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దేశంలో పొలిటికల్ మ్యారేజ్ చట్టం: ఒవైసీ

asaduddin owisi

దేశంలో పొలిటికల్ మ్యారేజ్ చట్టం వచ్చిందని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్ పెళ్లాడితే రిసెప్షన్ మాత్రం శరద్ పవార్ చేసుకున్నారని ఒవైసీ వ్యాఖ్యానించారు.

ఎంఐఎం ఇప్పుడు రాష్ట్రం మొత్తం విస్తరిస్తోందని అన్నారు. తనకు ఇద్దరు భార్యలు ఉన్నట్టు దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. ఉన్న ఒక్క భార్యతోనే పరేషాన్ అవుతుంటే, ఇద్దర్ని చేసుకుని ఎలా వేగుతాను? అంటూ చమత్కరించారు. ఇది పూర్తిగా అసత్య ప్రచారమని ఒవైసీ కొట్టిపారేశారు.

Related posts