telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నన్ను గవర్నర్‌గా నియమించడం తెలంగాణకు దక్కిన గౌరవం!

BANDARU DATTATREYA

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం దత్తాత్రేయ తొలిసారిగా తెలంగాణలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో ఆయన  ప్రత్యేక పూజలు చేశారు. పూజ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నన్ను గవర్నర్‌గా నియమించడమనేది తెలంగాణకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని బండారు దత్తాత్రేయ అన్నారు.

యాదాద్రి ఆలయం దేశంలో ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా విరసిల్లాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ అనేది ఎన్నో శక్తిపీఠాలున్న గొప్ప ఆధ్యాత్మిక కేంద్రమని తెలిపారు. ప్రజలు ఆధ్యాత్మిక భావన పెంపొందించుకోవాలని చెప్పుకొచ్చారు. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలను లింక్ చేసి టూరిజం అభివృద్దికి తోడ్పడతానని చెప్పారు. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రెండూ గొప్ప పోరాటాల గడ్డ అని ఆయన పేర్కొన్నారు.

Related posts