telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ…2 నుంచి 3 గంటల్లోనే దర్శనం!

tirumala temple

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీగ ణనీయంగా తగ్గిపోయింది. ఈ ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఒకే ఒక్క కంపార్టుమెంట్ లో భక్తులు సర్వ దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వీరికి 2 నుంచి 3 గంటల వ్యవధిలోనే దర్శనం పూర్తవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇదే సమయంలో దివ్య దర్శనం, టైమ్ స్లాట్ టోకెన్లు, ప్రత్యేక దర్శనం టోకెన్లు పొందిన భక్తులు మాత్రం స్వామి దర్శనం కోసం భారీ సంఖ్యలో వేచి చూస్తున్నారు.

ధనుర్మాసం కారణంగా ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతూ ఉండగా, రేపు జరగాల్సిన పౌర్ణమి గరుడ సేవను రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 70,534 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ. 2.63 కోట్ల హుండీ ఆదాయం లభించింది. సంక్రాంతి సెలవులు ముగిసేంత వరకూ రద్దీ సాధారణ స్థాయిలోనే ఉండవచ్చని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.

Related posts