telugu navyamedia
రాజకీయ వార్తలు

తెలుగు రాష్ట్రాలకు కొత్త కాంగ్రెస్‌ ఇన్‌చార్జిలు

congress flags

ఎన్నికల్లో వరస ఓటములతో అల్లాడిపోతున్న కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు అధినేత్రి సోనియా గాంధీ నడుం బిగించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతోపాటు కీలకమైన సంస్థాగత పదవుల్లోనూ భారీ మార్పులు చేసింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ నూతన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిలను అపాయింట్ చేసింది.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఊమెన్‌చాందీ నియమితులయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ప్రస్తుత ఇన్‌చార్జి కుంతియాను తొలగించిన అధిష్ఠానం..ఆ బాధ్యతలను మాణికం ఠాగూర్‌ కు అప్పగించింది. సీడబ్ల్యూసీ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా కాంగ్రెస్‌ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా పార్టీ వ్యవహారాల నిర్వహణలో భాగంగా అధ్యక్షురాలికి సహాయ కమిటీని నియమించింది.

Related posts