telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జీహెచ్ఎంసీ : ఉచిత మంచినీటి స‌ర‌ఫ‌రా తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు…

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాలకు అనుగుణంగా హైదరాబాద్ లో ఉచిత మంచినీటి సరఫరా ప్రక్రియను వేగవంతం చేయుటకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. మెరుగైన త్రాగు నీటి సరఫరా కోసం వినియోగదారుల PTIN మరియు CAN నెంబర్ లతో ఆధార్ సీడింగ్ ను పూర్తి చేయాలని, ఇప్పటి వరకు సరఫరా కాని ప్రాంతాలు మరియు మురికి వాడలలో ఉన్న ఇండ్లకు త్రాగు నీటి సరఫరా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ యం.డి, శ్రీ దాన కిషోర్ ను ఆదేశించారు. రాష్ట్రంలో 2BHK నిర్మాణాలు మౌళిక వసతులు తో సహ వేగంగా పూర్తి చేయడానికి తగు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ వార్డులలో ట్రీ పార్కులు అభివృద్ధి పరచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.

Related posts