telugu navyamedia
క్రీడలు వార్తలు

నేను టీం ఇండియా కెప్టెన్ అయితే వారిని తీసుకోను…

గతకొన్నాళ్లుగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియా స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ ఇద్దరు దారుణంగా విఫలమయ్యారు. 10 మ్యాచ్‌ల్లో యూజీ 9 వికెట్లే తీయగా.. కుల్దీప్ కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే అవకాశం దక్కించుకొని ప్రభావం చూపలేకపోయాడు. ఈ క్రమంలోనే టీమ్‌మేనేజ్‌మెంట్ అశ్విన్-జడేజాలకు మరో అవకాశం ఇవ్వాలని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ సూచించాడు. వారి అనుభవం, గేమ్ చేజింగ్ సామర్థ్యం జట్టుకు ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు. నేనే టీమిండియా కెప్టెన్ అయితే మాత్రం కుల్దీప్-చాహల్‌కు బదులు అశ్విన్-జడేజాను టీ20 వరల్డ్‌కప్‌టీమ్‌కు ఎంపిక చేస్తాను. ఇక వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ కూడా టీమిండియాలోకి పునరాగమనం చేసే అవకాశం ఉందని పనేసర్ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున బరిలోకి దిగిన అతను అద్భుత ప్రదర్శన కనబరిస్తే టీమిండియా జట్టులోకి వచ్చే చాన్స్ ఉందని పనేసర్ అభిప్రాయపడ్డాడు.

Related posts