telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

అనంతపురంలో దారుణం.. చికిత్స కోసం వచ్చిన మహిళ పై లైంగిక దాడి..

ఆంధ్ర ప్రదేశ్ అనంతపురంలో మహిళలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి.. పోలీసులు కట్టడి చేయాలని ప్రయత్నించిన కూడా మహిళలను కామాంధులు వదలడం లేదు. తాజాగా మరో ఘటన కలకలం రేపుతోంది. ఆసుపత్రికి వచ్చిన మహిళ పై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం చేయబోయాడు..అంతలోనే ఆమె భర్త రావడంతో అక్కడి నుంచి పారిపోయాడు.. వివరాల్లోకి వెళితే..పాము కరిచి ప్రాణాల మీదకు రావడంతో ఆసుపత్రిలో చేరిన ఓ వివాహిత తో అంబులెన్స్ డ్రైవర్ అమానుషంగా ప్రవర్తించాడు.

నిన్న ఉదయం పాము కరిచిందని ఫాతిమా అనే మహిళ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అయితే ఆమెను పరీక్షించి న వైద్యులు విషాన్ని బయటకు తీశారు. ఆసుపత్రిలో రెండు రోజులు ఉండమని చెప్పారు. ఆమెతో పాటుగా తన భర్త హుస్సేన్ ఉన్నాడు. అయితే భార్య నీరసంగా ఉంది. డాక్టర్ ఎనర్జీ డ్రింక్ ను తాగించమని అడిగారు. వెళ్లి తీసుకురా అని ఆ డ్రైవర్ హుస్సేన్ ను బయటకు పంపాడు. ఫాతిమా పై కన్నేసిన కామాంధుడు ఆమె పై
లైంగిక దాడి చేశాడు. అంతలోకే హుస్సేన్ రావడం గమనించి అక్కడి నుంచి చెక్కేశాడు. ఆసుపత్రి సిబ్బందికి హుస్సేన్ కంప్లైంట్ ఇచ్చాడు.

Related posts