సీబీఐ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వేగం పెంచింది. వివేకా సన్నిహితులతో పాటు కీలక వ్యక్తులను విచారణ చేశారు సీబీఐ అధికారులు. గతంలో సీబీఐ బృందంలో పలువురికి కరోనా సోకడంతో మధ్యలో విచారణకు బ్రేక్ పడింది..అంతేగాకుండా వివేకా కూతురు సునీత ఢిల్లీకి వెళ్లి సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసిన అనంతరం కేసులో మరింత వేగం పెంచారు..సీబీఐ విచారణలో భాగంగా పులివెందులకు చెందిన పలువురు కీలక వ్యక్తులను విచారణ చేసి హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.. పులివెందుల చేరుకున్న సీబీఐ బృందం ఆర్ అండ్ బి గెస్ట్ లో మకాం వేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.. దర్యాప్తులో భాగంగా వివేకా ఇంటి సమీపంలో ఉన్న పాల డైరీ వ్యాపారులతో పాటు ఓ సెల్ పాయింట్ నిర్వాహకుడిని కూడా సీబీఐ బృందం ప్రత్యేకంగా విచారణ చేసింది. అనంతరం సీబీఐ బృందం వైఎస్ వివేకాకు అత్యంత సన్నిహిత వ్యక్తి అయిన ఎర్ర గంగిరెడ్డి ని కూడా విచారణకు పిలిపించి సుమారు రెండు గంటలకు పైగా విచారణ చేశారు..విచారణలో భాగంగా హత్య జరిగిన తీరుతో పాటు అనుమానిత వ్యక్తుల సమాచారం గురించి ఆరా తీసి స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు సమాచారం. ఇక గతంలో సీబీఐ విచారణకు హాజరైన వారిని సైతం మరోసారి విచారణకు పిలిపించి స్టేట్మెంట్ రికార్డు చేస్తారని సమాచారం… ఇలా ఇక చివరి సారి అంటే సీబీఐ విచారణలో త్వరితగతిన కేసులో దోషులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారనే తెలుస్తోంది.
అక్కా అక్కా అంటూనే తొక్కేసారు… బిగ్ బాస్ పై హేమ వ్యాఖ్యలు