telugu navyamedia
Uncategorized వార్తలు సామాజిక

యూపీలో కరోనా విలయతాండవం.. కొత్తగా 1986 పాజిటివ్ కేసులు

corona vairus

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విలయతాండవం చేస్తోంది. దీంతో ప్ర‌తిరోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఆరోగ్య‌శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అమిత్ మోహ‌న్ ప్ర‌సాద్ వెల్లడించిన వివ‌రాల‌ ప్రకారం.. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 1,986 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 45,928కి చేరింది. అందులో 28,664 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 17,264 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా రోజురోజుకు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా ఎలాంటి మ‌ర‌ణాలు చోటుచేసుకోనప్ప‌టికీ ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1,108కి చేరింది.

Related posts