నేడు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీతో కొద్దిసేపు సమావేశమైన ఆయన.. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ తో విస్తృతంగా సంప్రదింపులు జరపనున్నారు. టెర్రరిజం, హెచ్-1 బీ వీసా, ట్రేడ్, రష్యాతో భారత్ ఆయుధ కొనుగోళ్లు, ఇరాన్ పై అమెరికా ఆంక్షలు, ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలని భారత్ తీసుకున్న నిర్ణయం వంటి వివిధ అంశాలపై ఆయన చర్చించనున్నారు.
రెండవసారి మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పిదప వచ్చిన మొదటి విదేశీ అధికారి అమెరికా విదేశాంగ మంత్రి. పాంపియో రాకతో అమెరికాతో భారత వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కేటీఆర్ ‘చిలక’ తో పోల్చిన చార్మినార్ ఎమ్మెల్యే…