telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రైల్వే ఉద్యోగాల పేరిట భారీ మోసం…

రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని రిటైర్డ్ ఎస్సై మోసం చేశాడని.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన సాన అనిల్ కుమార్, కునబోయిన చంద్రశేఖర్ ఇద్దరు యువకులు వాపోయారు. పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని దీంతో హెచ్ఆర్సీని ఆశ్రయించమని బాధితులు తెలిపారు. ఇప్పటివరకు తమకు న్యాయం జరగలేదని తెలిపారు. అయితే ఏం జరిగిందంటే… 2016లో జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న ఎస్సై గుర్రం రాజమౌళి పరిచయం అయ్యాడు. తనకు రైల్వే శాఖలో తెలిసిన వారు ఉన్నారని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఇప్పిస్తానని వీరికి నమ్మబలికాడు. ఒక్కొక్కరి దగ్గర 13 లక్షలు అప్పనంగా దొబ్బడు. ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా తీసుకున్నాడు. ఇప్పటి వరకు వారికి ఉద్యోగం రాక ఇటు డబ్బులు రాక ఇబ్బంది పడుతున్న మన్నారు. ఎస్సై గుర్రం రాజమౌళిని బాధితులు తాము ఇచ్చినా డబ్బులు తిరిగి  ఇవ్వాలని కోరగా తను ఎస్సై నని ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరింపులకు గురి చేశాడని మీడియా ముందు వాపోయారు. వీరేకాక ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రిటైర్డ్ ఎస్సై గుర్రం రాజమౌళి బాధితులు వీరే కాక ఇంకా  చాలా మంది బాధితులు ఉన్నారని తెలిపారు.

Related posts