telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

అబద్దాలు చెప్పడంలో తన‌ తండ్రి మించిపోయాడు కేటీఆర్…

బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అబద్దాలు చెప్పటంలో కేటీఆర్ తన‌ తండ్రిని మించిపోయాడు అని బీజేపీ నేత వివేక్ వెంకట స్వామి అన్నారు. ఐటీఐఆర్, ఖాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీపై మంత్రి కేటీఆర్ అవాస్తవాలు చెప్తున్నారు. నివాసయోగ్యమైన నగరాల జాబితాలో 4వ స్థా‌నం‌ నుంచి హైద్రాబాద్ 24వ స్థానానికి పడిపోవటం కేటీఆర్ అసమర్థతే అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పూర్తిగా విఫలం.. పార్లమెంట్ ఎన్నికల్లో,దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ఓడిపోయారు… తెలంగాణ ప్రభుత్వ అసమర్థత వలనే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రాలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలు చెంప దెబ్బ కొట్టబోతున్నారు. మోదీ ఫోటో పెట్టడం ఇష్టం లేకనే కేంద్ర పథకాలను అమలు చేయటం లేదు అని చెప్పిన ఆయన కేటీఆర్ అమెరికాలో చదువుకున్న అజ్ఞాని. దుబ్బాక, గ్రేటర్ ఫలితాల తర్వాత మతి భ్రమించి మాట్లాడుతున్నారు అని అన్నారు. ముద్ర లోన్స్ పై అవాస్తవాలు చెప్తోన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా అని పేర్కొన్నారు. చూడాలి మరి ఈ వ్యాఖ్యల పై కేటీఆర్ ఎలా స్పందిస్తాడు అనేది.

Related posts