సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రూ.50లక్షల ఇన్పూరెన్స్ డబ్బు కోసం బాబాయ్ సైదులును రమేష్ అనే వ్యక్తి కారుతో ఢీకొట్టి చంపేశాడు. గత నెల 25న రోడ్డు ప్రమాదంలో సైదులు మృతి చెందినట్లు రమేష్ చిత్రీకరించాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మునగాల పోలీసులు లోతుగా విచారణ జరుపగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో రమేష్తో పాటు అతడి స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సైదులును అతడి సోదరుడి కుమారుడు రమశ్ బొలెరో వాహనంతో ఢీ కొట్టి చంపినట్లు నిర్ధారించుకున్నామని తెలిపారు. బీమా డబ్బు కోసమే అతడు ఈ దారుణ ఘటనకు పాల్పడినట్లు వెల్లడించారు.
సీఎం జగన్ ఉద్యమానికి ఊపిరి పోశారు…