భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ లో ప్రస్తుతం రెండో టెస్ట్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్లో టీమిండియా అదరగొడుతోంది. మ్యాచ్లో విజయానికి మరో 4 వికెట్ల దూరంలో ఉంది. స్పిన్కు విపరీతంగా సహకరిస్తున్న పిచ్పై రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ చెలరేగి.. ఇంగ్లాండ్ భారీ దెబ్బ తీశారు. ఈ టర్నింగ్ పిచ్పై ఇంగ్లాండ్ గెలవాలంటే అద్భుతం జరగాల్సిందే. అయితే రెండో టెస్టులో టీం ఇండియా విజయానికి మరింత దగ్గరైంది. అక్షర్ పటేల్ వేసిన 43 వ ఓవర్ 5 వ బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన ఓలీ పోప్ మిడ్ వికెట్లో ఉన్న ఇషాంత్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ 110 పరుగుల వద్ద 6 వ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో రూట్, స్టోక్స్ ఉన్నారు. ఇక ఇంగ్లండ్ ప్రస్తుత స్కోర్ 115-6 గా ఉంది. కాగా… తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 195 పరుగులు కలుపుకొని ఇంగ్లాండ్కు భారత్ 482 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 482 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ ఆటముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది.
previous post