telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పెట్టుబడిదారుల కొమ్ముకాసేలా కేంద్ర బడ్జెట్: పొన్నాల

ponnala lakhmaih

పెట్టుబడిదారుల కొమ్ముకాసేలా కేంద్ర బడ్జెట్ ఉందని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఈ బడ్జెట్ లో ‘తెలంగాణ’కు ఒక్క రూపాయి కూడా కేటాయింలేదని అన్నారు. కేంద్ర బడ్జెట్ తమను నిరుత్సాహపరిచిందని చెప్పారు.సామాన్యుల ఆశలపై మోదీ ప్రభుత్వం నీళ్లు చల్లిందని ధ్వజమెత్తారు.

ఏడాదిలో జీడీపీ 10శాతానికి పెంచుతామనడం ఆశ్చర్యకరమని ఆయన పేర్కొన్నారు. మరో ఏడాదిలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామంటూ ..ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు? అంటూ కేంద్రబడ్జెట్ పై విమర్శలు చేశారు. బడ్జెట్ లో విభజన హామీల ప్రస్తావనే లేదని, టీఆర్ఎస్ ఎంపీలు ఏం చేస్తున్నారో తమకు అర్థం కావడం లేదని అన్నారు.

Related posts