పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కోల్కతాలోని పార్టీ కార్యాలయంలో బంకుర, ఝర్గామ్లకు చెందినపార్టీ నేతలతో రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. జేపీతో టచ్లో ఉన్న నేతలను గుర్తించాలని సూచించారు. వారికి పార్టీ నుంచి ఉద్వాసన తప్పదని హెచ్చరించారు. నేతలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించి అధికారంలో వస్తుందని బరోసా కల్పించింది.
పార్టీ నేతలందరూ తిరిగి ప్రజల్లోకి వెళ్లి వారితో సంబంధాలు పునరుద్ధరించుకోవాలని సూచించారు. ఇతర పార్టీ మద్దతుదారులతో గొడవలకు దిగొద్దని హితవు పలికారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ 18 సీట్లు గెలుచుకోవడం టీఎంసీ జీర్ణించుకోలేక పోతుంది. దీంతో మమత ఎక్కువగా పార్టీ కార్యకలాపాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అయినప్పటికీ బీజేపీలోకి వలసలు ఆగడం లేదు. ఇప్పటి వరకు ఏడుగురు టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో బీజేపీలో టచ్లో ఉన్న మిగతా వారిని గుర్తించి పార్టీ నుంచి తొలగించాలని మమత యోచిస్తున్నారు.