telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లో క్రీమ్ ఫంగ‌స్…

ప్రస్తుతం మన దేశంలో కొత్త కొత్త ఫంగస్ లు కలవరపరుస్తున్నాయి. ఇప్పటికే బ్లాక్‌, వైట్‌, ఎల్లో ఫంగ‌స్ లు ద‌డ‌పుట్టిస్తుండ‌గా ఇప్పుడు మ‌రో కొత్త వైర‌స్ ఇబ్బంది పెడుతుంది. అదే క్రీమ్ ఫంగ‌స్‌. క్రీమ్ ఫంగ‌స్ కేసు ఒక‌టి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్‌పూర్‌లోని నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ వైద్య క‌ళాశాలలో ఈఎన్‌టీ వైధ్యాధికారులు గుర్తించారు. బ్లాక్ ఫంగ‌స్‌తో పాటుగా రోగి శ‌రీరంలో క్రీమ్ ఫంగ‌స్‌ను కూడా వైధ్యాదికారులు గుర్తించారు. అయితే అత‌ని ఆరోగ్యం ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గానే ఉంద‌ని, ప్ర‌స్తుతం వైద్యం అందిస్తున్నామ‌ని చెబుతున్నారు. మితిమీరిన యాంటి బ‌యాటిక్ ఔష‌దాలను వినియోగించ‌డం వ‌ల‌న జీర్ణాశయంలోని గ‌ట్ బ్యాక్టీరియా న‌శిస్తుంద‌ని, దీని కార‌ణంగానే ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్లు వ‌స్తున్నాయ‌ని వైద్య‌నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అయితే చూడాలి మరి ఈ ఫంగ‌స్ ప్రభావం దేశం పైన ఎలా పడుతుంది అనేది.

Related posts