telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

యూనివర్సిటీలకు త్వరలో వీసీలు: మంత్రి సబిత

Sabitha indrareddy

యూనివర్సిటీలకు వీలయినంత త్వరలో వీసీలు వస్తారని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్‌లతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు.

ఇకపై ప్రతీ మూడు నెలలకు సమీక్షా సమావేశం ఉంటుందనీ దాంతో యూనివర్సిటీల్లో ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు. ప్రస్తుతం అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారనీ, ఇకపై మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లో పెట్టేలా ప్రయత్నిద్దామని పేర్కొన్నారు. విద్యా రంగంలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వ సహాయం తీసుకుందామని అధికారులకు సూచించారు.

Related posts