అధ్యక్షపదవి కోసం కాంగ్రెస్ లో మొత్తానికి చాలా మంది మల్లగుల్లాలు పడుతున్నట్టే ఉంది. రాజకుమారుడికే అది దక్కాలని అధిష్టానం పూనుకుని కూడా చాలా కాలం అయినప్పటికీ, తాజా రాజకీయ పరిస్థితులు ఈ నేపధ్యానికి కారణం అయ్యాయి. తాజాగా రాహుల్గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరుతూ ఆ పార్టీ నేతలు ఆంధ్రరత్నభవన్లో నిరాహారదీక్షకు పూనుకున్నారు.
కాంగ్రెస్ యువజన విభాగం నగర కమిటీ అధ్యక్షుడు సతీష్, సేవాదళ్ కార్యనిర్వాహక కార్యదర్శి గౌస్, 31వ డివిజన్ కమిటీ అధ్యక్షుడు ప్రకాశ్ కలిసి ఈ దీక్షలో కూర్చుకున్నారు. విజయ వాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి నరహరశెట్టి నరసింహరావు, సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి వి.గురునాథం వారికి మద్దతు ప్రకటించారు.