కర్నూలు జిల్లాలో ఉదయాన్నే ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నటేకూరు దగ్గర ఓవర్టేక్ చేయబోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. లారీని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
లారీలోని ఇనుప పైపులు బస్సులోకి దూసుకెళ్లాయి. దీనితో సీట్లలోనే ప్రయాణికులు మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం చిన్నటేకూరు వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగింది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
జగన్ను గెలిపిస్తే కేసీఆర్ కాళ్లు మొక్కుతారు: చంద్రబాబు