telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రకాశం జిల్లా చిన్నారి లేఖపై స్పందించిన సీఎం జగన్!

మమ్మల్ని వెలివేశారు అంటూ ఎనిమిదేళ్ల చిన్నారి ఏపీ సీఎం జగన్ కు లేఖ రాయడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ప్రకాశం జిల్లా రామచంద్రాపురానికి చెందిన పుష్ప అనే ఆ బాలిక తన తండ్రి, తాతలను చంపేస్తామని బెదిరిస్తున్నారని, తమను వెలివేశారని లేఖలో పేర్కొంది. ఈ కథనాలు పలు దినపత్రికల్లో సైతం ప్రచురితమయ్యాయి. తనతో స్కూలులో కూడా ఎవరూ మాట్లాడటం లేదనీ, ఒకవేళ ఎవరైనా మాట్లాడితే రూ.10,000 జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు హెచ్చరిస్తున్నారని చిన్నారి సీఎంకు విన్నవించుకుంది.

తమకు అండగా నిలవాలని నాలుగో తరగతి చదువుతున్న ఈ చిన్నారి ముఖ్యమంత్రిని కోరింది. ఈ విషయం ఎట్టకేలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి వెళ్లింది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్ తో ముఖ్యమంత్రి ఫోన్ లో మాట్లాడారు. వెంటనే బాలిక వివరాలు కనుక్కోవాలనీ, సమస్యను పరిష్కరించాలని జగన్ ఆదేశించారు.

Related posts