ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీ కూడా కీలక పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్ళు అయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
గురువారం నాడు న్యూఢిల్లీలో రాష్ట్రావతరణ దినోత్సవం వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయజెండా మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్రం తరపున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు.
ఈ ఉత్సవాలను అమరులకు అంకితం చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.. పార్లమెంట్ లో ప్రత్యేక తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు అప్పట్లో రాజ్నాథ్ సింగ్, సుష్వాస్వరాజ్ పోరాటం చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు కోసం..ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడలు వంచి పోరాటం చేశామని గుర్తు చేశారు.
హుజూర్ నగర్ లో ఉత్తమ్ భార్యను పోటీకి ఎలా నిలుపుతారు?: కర్నె ప్రభాకర్