telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం కీలకం: కేటీఆర్‌

KTR TRS Telangana

దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం కీలకమని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన టైమ్స్‌ నౌ సమ్మిట్‌లో భాగంగా భారతదేశ నిర్మాణంలో రాష్ర్టాల పాత్ర అనే అంశంపై కేటీఆర్‌ మాట్లాడారు. బలమైన రాష్ట్రాలతోనే బలమైన దేశం నిర్మాణం అవుతోంది అని ఆయన స్పష్టం చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్‌, బీజేపీ లు దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, ఇప్పుడు దేశంలో ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయన్నారు.

తెలంగాణలో రాహుల్‌ను, మోదీని ప్రజలు తిరస్కరించారు. జాతీయ పార్టీలకు ప్రజల్లో ఆదరణ తగ్గిపోయింది. కాంగ్రెస్‌, బీజేపీ దేశానికి చేసిందేమీ లేదన్నారు కేటీఆర్‌. టీఆర్‌ఎస్‌ పార్టీ ఏ జాతీయ పార్టీకి బీ టీం కాదు. తాము తెలంగాణకు ఏ టీం అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రజా తీర్పును స్వీకరిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Related posts