telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం…

fire in plastic factory dhaka 13 died

తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్‌ ఉత్పాదన కేంద్రంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతున్న సమయంలో ట్రాన్స్‌ ఫార్మర్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఉద్యోగులు… చాకచక్యంతో వ్యవహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో అక్కడ భారీ ప్రమాదమే తప్పింది. ఆకస్మాత్తుగా మంటలు ఎలా వచ్చాయన్నది ఇంకా తెలియడం లేదు. దీనిపై అప్రమత్తమైన అధికారులు… ఈ ప్రమాదం పై విచారణను ప్రారంభించారు. కాగా… గతేడాది శ్రీశైలంలోని భూగర్భ జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం లో కూడా ఇలాగే మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా తొమ్మిది మంది మృతి చెందారు. అయితే… ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికంగా కలకలం రేగింది.

Related posts