తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్ ఉత్పాదన కేంద్రంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న సమయంలో ట్రాన్స్ ఫార్మర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఉద్యోగులు… చాకచక్యంతో వ్యవహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో అక్కడ భారీ ప్రమాదమే తప్పింది. ఆకస్మాత్తుగా మంటలు ఎలా వచ్చాయన్నది ఇంకా తెలియడం లేదు. దీనిపై అప్రమత్తమైన అధికారులు… ఈ ప్రమాదం పై విచారణను ప్రారంభించారు. కాగా… గతేడాది శ్రీశైలంలోని భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం లో కూడా ఇలాగే మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా తొమ్మిది మంది మృతి చెందారు. అయితే… ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్లో అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికంగా కలకలం రేగింది.
previous post
next post