బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రారంభమైంది. ఉదయం 6 గంటల సమయంలో మొదలైన బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు బాలాపూర్ సెంటర్లో నిలిచింది. బాలాపూర్ గణేష్ కార్యవర్గ సభ్యులు ఈ లడ్డూ వేలంపాటను చేపట్టారు. లడ్డూ వేలం పాట ముగిసిన అనంతరం శోభాయాత్ర మొదలుకానుంది
కాగా ..28 ఏళ్లలో 2021లో రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డూ వేలంపాట జరిగింది. బాలాపూర్ గణేష్ లడ్డూ 2021లో రూ.18.90 లక్షలు పలికింది.
ఈ ఏడాది లడ్డూ రూ.2 లక్షలు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. లడ్డూ కోసం ఆరుగురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరులు పోటీ పడుతున్నారు.
1994 నుంచి బాలాపూర్లో గణేష్ లడ్డూ వేలంపాట కొనసాగుతోంది. బాలాపూర్ లడ్డూ వేలంపాట మొదట రూ.450తో ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు బాలాపూర్ గణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది.