telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అధికారులు హెడ్ క్వార్టర్స్‌ను వదిలి వెళ్లొద్దు: హ‌రీశ్‌ రావు

Harish Rao trs

తెలంగాణలో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండ‌టంతో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హ‌రీశ్‌రావు సూచించారు. భారీ వర్షాల నేప‌థ్యంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు. అధికారులు ఎట్టిప‌రిస్థితుల్లో హెడ్ క్వార్టర్స్‌ను వదిలి వెళ్లొద్దని ఆదేశించారు.

వర్షాలతో కూలిన ఇళ్లు,పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల కుటుంబాలకు యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల కుటుంబాలకు పునరావాసం కల్పించాలని సూచించారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రేషన్, పరిహారం అందించాల‌ని అధికారులకు సూచించారు.

Related posts