*బాలాపూర్ గణేష్డుకు రికార్డు స్థాయి ధర
*రికార్డు దిశగా 24 లక్షలు దాటిన లడ్డూ వేలం పాట
*24 లక్షలు 64 వేలు పలికిన బాలాపూర్
*వేలంలో లడ్డూను దక్కించుకున్న లక్ష్మారెడ్డి
బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియ ముగిసింది. లడ్డూను ఏకంగా 24 లక్షల 60 వేలు చెల్లించి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు
రూ. 24.64లక్షల బాలపూర్ లడ్డూను పొంగులేటి లక్ష్మారెడ్డి సొంతం చేసుకున్నారు. గత ఏడాది రూ.18.90 లక్షలు మేర లడ్డూ ధర పలుకగా.. ఈ ఏడాది రూ. 5.70 లక్షలు ఎక్కువగా లడ్డూ ధర పలికింది.
ఈ ఏడాది లడ్డూ రూ 24 లక్షలు లడ్డూ దాటింది. వేలం పాటలో లడ్డూ కోసం ఆరుగురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరులు పోటీ పడ్డారు.
1994 నుంచి బాలాపూర్లో గణేష్ లడ్డూ వేలంపాట కొనసాగుతోంది. బాలాపూర్ లడ్డూ వేలంపాట మొదట రూ.450తో ప్రారంభమైంది.
కాసేపట్లో బాలాపూర్ గణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర కేశవగిరి నుంచి ట్యాంక్బండ్ వరకు సాగుతుంది. ఈ శోభాయాత్ర సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను సమీక్షించిన పోలీసు అధికారులు.. ఎక్కడా ఎలాంటి అవాంతరం కలుగకుండా సాఫీగా యాత్ర సాగడానికి చర్యలు చేపట్టారు.
మత విద్వేశాలు రెచ్చ గొట్టి చలికాచుకోవాలనేదే బీజేపీ ప్రయత్నం..