telugu navyamedia
తెలంగాణ వార్తలు

సోనియా చొరవతో ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా తెలంగాణ ఏర్పడింది..

తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. సోనియా గాంధీ చొరవతో ప్రజల అరవై ఏళ్ల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని రేవంత్ రెడ్డి అన్నారు.

వందలాది మంది అమరుల త్యాగాల సాక్షిగా సాధించుకున్న రాష్ట్రంలో స్వపరిపాలన సుపరిపాలన అవుతుందని ఆశించిన తెలంగాణకు గులాబీ చీడ పట్టుకుందని రేవంత్ విమర్శించారు.

ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రతి ఒక్కరికీ ఏడుపే మిగిలిందన్నారు. అమరుల త్యాగాలకు విలువ లేకుండా విధ్వంస పాలన సాగిస్తున్న గులాబీ చీడను తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు

రైతుల ఆత్మహత్యలు లేని, యువత ఉపాధికి కొదువలేని… ప్రతి విద్యార్థికి చదువు… ప్రతి అవ్వ,అయ్యకు పెన్షన్… ప్రతి ఆడబిడ్డకు భద్రత… ప్రతి పేదవాడి మొహాన చిరునవ్వు చూసే తెలంగాణ తన స్వప్నమన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ విశ్రమించకుండా శ్రమిస్తుందని రేవంత్ తెలిపారు.

 

 

Related posts