telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

వేదమంత్రాలతో ప్రతిధ్వనిస్తోన్న ఎర్రవల్లి

KCR Sahasra Chandiyagam Erravalli
గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో రోజు యాగం మంగళవారం ప్రారంభించారు. ఇవాళ చతుర్వేద మహారుద్ర సహిత సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. సహస్ర చండీయాగానికి కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 
ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన 300 మందిపైగా రుత్విక్కుల వేదపారాయణాలు, వేదమంత్రాలు ఎర్రవల్లి ప్రతిధ్వనిస్తోంది. విశాఖపట్నానికి చెందిన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో యాగం కొనసాగుతోంది. చండీయాగంలో భాగంగా ఈ నెల 25న పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఐదు రోజులపాటు చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీయాగం కొనసాగనుంది.

Related posts