telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబుకు సెక్యూరిటీ పై హైకోర్టులో పిటిషన్

chandrababu on amaravati mla quarters

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడికి భద్రత తగ్గించారంటూ సుబ్బారావు అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబుకు, ఆయన కుటుంబ సభ్యులకు భద్రత తగ్గించారంటూ ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు.

గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ కు 7 ప్లస్ 7 భద్రత కల్పించారని, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు 2 ప్లస్ 2 భద్రత కల్పించారని సుబ్బారావు తన పిటిషన్ లో ఆరోపించారు. అలిపిరి దాడి, 2016లో ఒడిశా ఎన్ కౌంటర్ వంటి అంశాలను కూడా ఆయన తన పిటిషన్ లో ప్రస్తావించారు. మరో వైపు తాము చంద్రబాబు కు ఎలాంటి భద్రత తగ్గించలేదని ఏపీ డీజీపీ గౌతమ్ సవంగ్ తెలిపిన విషయం తెలిసిందే.

Related posts