telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వివాహితను లక్ష రూపాయలకు విక్రయించింది ఓ వృద్ధురాలు…

crime

పని ఇప్పిస్తానంటూ వివాహితను లక్ష రూపాయలకు విక్రయించింది ఓ వృద్ధురాలు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో చోటు చేసుకుంది. భర్తతో గొడవపడి మార్చిలో ఇద్దరు పిల్లలతో వేములవాడ ఇంటి నుంచి వెళ్లిపోయింది వివాహిత.  సికింద్రాబాద్ లో పరిచయమైన ఓ వృద్ధురాలు పని ఇప్పిస్తానంటూ… మహారాష్ట్ర పర్భనికి తీసుకెళ్లి మోర అనే వ్యక్తి కి ఆ వివాహితకు లక్షరూపాయలకు విక్రయించింది. ఆ మోర అనే వ్యక్తి… రాజరామ్ అనే వ్యక్తికి ఆ వివాహితను అప్పగించాడు. అక్కడి నుంచి ఆ వివాహితను రాజరామ్… నాసిక్ లోని తన సమీప బంధువైన లక్ష్మణ్ జగపత్ అప్పగించాడు. మూడో భార్యగా ఉండాలంటూ లక్ష్మణ్ జగపత్ వేధింపులు చేస్తూ… పారి పోతే ఇద్దరు పిల్లలను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.  25వ తేదీన ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం ఇచ్చిన బాధితురాలు…బంధువుల ఫిర్యాదు మేరకు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బాధితురాలిని గుర్తించారు వేములవాడ పోలీసులు. అంతేకాదు… లక్ష్మణ్ జగపత్ ను అరెస్ట్ చేసి….ఆ వివాహితను సిరిసిల్ల సఖి కేంద్రానికి తరలించారు పోలీసులు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Related posts