telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్

సీఎం జగన్ ఆధ్వర్యంలో ఈ రోజు రాజధాని అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మొక్కజొన్న రైతులను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మొక్కజొన్న ధరలు పడిపోతున్నాయని రైతులకు కనీస మద్దతు ధర కరువైందన్నారు. ఈ నేపథ్యంలో రైతులు నష్టపోకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, మార్కెటింగ్ శాఖ ద్వారా కూడా కొనుగోళ్లు చేయాలని సూచించారు. సీఎం చేసిన ఈ నిర్ణయాలతో పాటు, ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట, వచ్చే ఏడాది నుంచి పాఠశాలల్లో ప్రారంభించనున్న 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధన అంశాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో రైతుల సమస్యలపై మంత్రి కన్నబాబు మాట్లాడారు.

Related posts