telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ భూదాహానికి దళితులు బలి: నారా లోకేశ్

Nara Lokesh

ఏపీ సర్కార్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. జగన్ భూదాహానికి దళితులు, గిరిజనులు బలైపోతున్నారని విమర్శించారు. భూమి కోసం గిరిజన యువకుడిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చింతలపాళెం పంచాయతీ, మరాఠీపురానికి చెందిన 112 షికారీ కుటుంబాలకు 1971 నుంచి మూడు విడతలుగా సుమారు 560 ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆ భూమిని కొట్టేయడానికి అధికార పార్టీ నాయకులు దాడికి దిగి 23 మందిని గాయపర్చారని అన్నారు.

గిరిజన యువకుడు డబ్బా బాబ్లీని అత్యంత కిరాతకంగా హత్యచేశారు. గిరిజన మహిళని అప్పు తీర్చలేదంటూ వైకాపా నాయకుడు ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటన మరవక ముందే ఇప్పుడు గిరిజన యువకుడు బలైపోయాడని చెప్పారు. అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకున్న భూమిని వెంటనే దళితులు, గిరిజన కుటుంబాలకు అందజేయాలని లోకేశ్ ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు.

Related posts