మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించింది. పాక్ జరిపిన కాల్పుల్లో సరిహద్దుల్లోని ఆరుగురు చనిపోయారు. ఇందులో నలుగురు పౌరులు కాగా, మరో ఇద్దరు జవాన్లు ఉన్నారు. బారాముల్లా జిల్లా సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ దాడిలో చనిపోయినవారిలో నలుగురు పౌరులు కాగా, మరో ఇద్దరు జవాన్లు ఉన్నారు. బారాముల్లా జిల్లా.. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పదే పదే కాల్పులకు తెగబడుతోంది పాకిస్థాన్. దీపావళి సమయంలో… పాక్ జరిగిన కాల్పులు నలుగురు పౌరులను బలిగొంది. ఇద్దరు జవాన్లు హతమయ్యారు. పాకిస్థాన్.. కాల్పులకు భారత్ దీటుగా జవాబిస్తోంది. పాక్ కాల్పుల్లో చనిపోయిన వారిలో బీఎస్ఎఫ్ ఎస్ ఐ రాకేశ్ ధోవల్ ఉన్నారు. పాక్ ఆర్మీ కాల్పులకు దీటుగా జవాబిస్తోంది భారత ఆర్మీ… మోర్టార్ షెల్స్ను ప్రయోగించింది. దీంతో పాక్ సరిహద్దుల్లోని ఆర్మీ బంకర్లను పేల్చివేసింది. అటువైపుకూడా ఏడెనిమిది మంది సైనికులు హతమైనట్లు తెలుస్తోంది. దీపావళి సమయంలో పాక్ రెచ్చగొట్టే ప్రయత్నాలకు దిగింది. దీనికి భారత ఆర్మీ దీటుగా సమాధామ ఇచ్చింది.
previous post
సీఏఏకు వ్యతిరేకంగా భారీ కుట్ర: అమిత్ షా