telugu navyamedia
సినిమా వార్తలు

పార్లమెంట్ లో అల్లు అర్జున్ విలన్ సాంగ్… వీడియో వైరల్

Ravi-Kishan

సినీ నటుడు, గోరఖ్ పూర్ ఎంపీ రవి కిషన్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గోరఖ్ పూర్ నుంచి బీజేపీకి తరుపున రవి కిషన్ ఎంపీగా గెలుపొందారు. తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రవి కిషన్ తన ప్రసంగంతో లోక్ సభలో ఆకట్టుకున్నారు. భారత్ లో 25 కోట్ల మంది భోజ్ పురి భాషను మాట్లాడుతారనీ, అర్థం చేసుకోగలరని రవి కిషన్ తెలిపారు. మారిషస్ లో మరో అధికార భాషగా భోజ్ పురిని గౌరవించారని చెప్పారు. కరేబియన్ దేశాల్లో కూడా భోజ్ పురి మాట్లాడుతున్నారని అన్నారు. అయినా ఇప్పటివరకూ తమ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర ఇటీవల ‘కాశీ ప్రజలారా ఎలా ఉన్నారు?’ అంటూ భోజ్ పురిలో మాట్లాడారనీ, దీంతో తమ భాషకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం తామందరికీ కలిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రవికిషన్ భోజ్ పురిలో ఓ పాటను పాడి లోక్ సభ సభ్యులను అలరించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన “రేసుగుర్రం” సినిమాలో రవి కిషన్ విలన్ గా నటించి మెప్పించారు.

Related posts